జక్రాన్పల్లి కస్తూర్బా స్టూడెంట్స్కు అస్వస్థత

జక్రాన్పల్లి కస్తూర్బా స్టూడెంట్స్కు అస్వస్థత

​ఆర్మూర్, వెలుగు :  జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకులంలో బుధవారం కొందరు ఇంటర్​ స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పులిహోర, దోస తిన్న తర్వాత ఒక్కసారిగా బాడీ పెయిన్స్, తలతిరగడం వంటి లక్షణాలతో బాధపడ్డారు.  హుటాహుటిన ఆర్మూర్ ఏరియా హాస్పిటల్​కు వారిని తరలించారు. డాక్టర్లు ప్రమిద, అమృత్ రాంరెడ్డి వైద్య సేవలు అందించారు.  ఒక విద్యార్థి శ్వాస కోస సమస్యతో బాధపడుతుండడంతో  నిజామాబాద్ హాస్పిటల్​కు తరలించారు.